టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి రెండోరోజు మూడు నామినేషన్లు

by Disha Web Desk 2 |
టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి రెండోరోజు మూడు నామినేషన్లు
X

దిశ, సిటీ బ్యూరో: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా రెండో రోజైన శుక్రవారం ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు మూడు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి ప్రియాంక ఆలే ప్రకటించారు. దేవన్నగిరి మల్లారెడ్డి, గాలి హర్షవర్ధన్ రెడ్డి, గుర్రం చెన్నకేశవ రెడ్డిలు ఒక్కొక్క సెట్టు నామినేషన్లు సమర్పించినట్లు ఆమె తెలిపారు.

ఈ స్థానంలో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు అభ్యర్థులు తొమ్మిది సెట్లుగా నామినేషన్లు దాఖలు చేసినట్లు వివరించారు. హైదరాబాద్ లోకల్ అథారటీ ఎన్నికకు రెండో రోజు కూడా ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం సూచన మేరకు ఈ నెల 18, 19 తేదీలలో (శని, ఆదివారం) ప్రభుత్వ సెలవులు ఉన్నందున, నామినేషన్లు స్వీకరించబడవని ఆమె తెలిపారు.

Also Read..

తెలుగు విశ్వ విద్యాలయం సాహితీ పురస్కారాలకు ఆహ్వానం

Next Story